AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Alert: ఇది కరోనా కన్నా డేంజరస్‌.. ప్రధాని మోదీ అలర్ట్‌.!

PM Modi Alert: ఇది కరోనా కన్నా డేంజరస్‌.. ప్రధాని మోదీ అలర్ట్‌.!

Anil kumar poka
|

Updated on: Aug 23, 2024 | 12:03 PM

Share

మంకీ పాక్స్‌పై WHO హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ అలర్టయ్యారు. మంకీపాక్స్‌ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

మంకీ పాక్స్‌పై WHO హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ అలర్టయ్యారు. మంకీపాక్స్‌ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో మంకీ పాక్స్‌ కేసులు నమోదవ్వగా 5 వందలకు పైగా మృతి చెందారు. అయితే భారత్‌లో ప్రస్తుతానికి ఎంపాక్స్‌ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ WHO సూచనల దృష్ట్యా వ్యాధి వ్యాప్తి నివారణకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, గ్రౌండ్ క్రాసింగ్‌లలోని ఆరోగ్య విభాగాలను అప్రమత్తం చేసింది.

మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తోంది. కరోనా తర్వాత అంతటి రేంజ్ లో భయానకంగా ఈ వ్యాధి మారింది. మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన లెక్కల ప్రకారం జనవరి నుంచి ఆఫ్రికాలో ఎంపాక్స్ కేసులు 18,737కు చేరినట్లు, మృతుల సంఖ్య 541కు చేరినట్లు తెలుస్తోంది. తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని WHO హెచ్చరికలు జారీ చేసింది. గతంలో కూడా మంకీపాక్స్ వైరస్‌ వెలుగు చూసినప్పటికీ ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్‌ జారీ చేసింది. ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్థాన్‌లోనూ ఎంపాక్స్‌ కేసులు గుర్తించినట్లు WHO ప్రకటించడంతో టెన్షన్ మరింత ఎక్కువైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Aug 23, 2024 12:03 PM