జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం.. ఏం జరిగిందంటే ??

Updated on: Dec 12, 2023 | 4:47 PM

జూకి వెళ్లినప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎన్నోరకాల వన్యప్రాణులు ఉంటాయి. జంతుప్రదర్శనశాలకు వచ్చిన కొందరు వ్యక్తులు అక్కడి జంతువులపై రాళ్ళు విసరడం వంటి వెకిలి చేష్టలు చేస్తుంటారు. కొందరు బోనులో ఉన్న జంతువులను ముట్టుకోవాలనే ప్రయత్నం చేసి ప్రమాదాల్లో పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు నెట్టింట చాలానే వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

జూకి వెళ్లినప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎన్నోరకాల వన్యప్రాణులు ఉంటాయి. జంతుప్రదర్శనశాలకు వచ్చిన కొందరు వ్యక్తులు అక్కడి జంతువులపై రాళ్ళు విసరడం వంటి వెకిలి చేష్టలు చేస్తుంటారు. కొందరు బోనులో ఉన్న జంతువులను ముట్టుకోవాలనే ప్రయత్నం చేసి ప్రమాదాల్లో పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు నెట్టింట చాలానే వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని షేర్‌బాగ్ జంతుప్రదర్శనశాలలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జూ సిబ్బంది పులి బోనులో సగం తిన్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని వన్యప్రాణి విభాగం సీనియర్ అధికారి ఉస్మాన్ బుఖారీ తెలిపారు. అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌, ఎన్‌క్లోజర్ నుండి వచ్చిన ఆధారాల ప్రకారం.. అతనిపై పులులు దాడి చేసిన సమయంలో అతడు బ్రతికే ఉన్నాడని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన తర్వాత పంజాబ్‌లోని తూర్పు ప్రావిన్స్‌లో ఉన్న ఈ జూని మూసివేశారు. అలాగే, పులి బోనులోకి ఆ మనిషి ఎలా వెళ్లాడనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సామాన్య రైతు కొడుకు.. ఇప్పుడు రూ.17,000 కోట్లకు అధిపతి

MLA వెడ్స్‌ IAS.. 3లక్షల మందికి ఆహ్వానం

Kolleru Lake: కొల్లేరుకు జల కళ.. విదేశీ పక్షుల సందడి

విదేశీ విద్యార్థులకు షాక్‌ !! వీసా నిబంధనలు మరింత కఠినతరం

ఈ ఆటో డ్రైవర్ చాలా స్పీడ్ గురూ !! రైలు కంటే వేగంగా వెళ్లి

 

Published on: Dec 11, 2023 08:44 PM
Loading...
Unable to load recommendations.
Follow Us