ఆంజనేయుడికి గుడి కడదామని పునాదులు తవ్వుతుండగా అద్భుతం వీడియో
మధ్యప్రదేశ్ లోని మోరిన జిల్లాలో గురువారం ఒక అరుదైన ఘటన వెలుగు చూసింది. గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు సంకల్పించారు. ఇందుకోసం అందరూ చందాలు వేసుకున్నారు. టెంపుల్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనుల కోసం పునాదులు తవ్వుతుండగా ఆశ్చర్యకరంగా ప్రాచీన కాలానికి చెందిన బంగారు నాణేలు బయటపడ్డాయి. సగౌరియాపురా గ్రామంలో జరుగుతున్న తవ్వకాల సమయంలో నాణేలు లభించడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకింది. గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకొని ఆ నాణేలను ఆసక్తిగా పరిశీలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.సుమారు 50 నుండి 60 బంగారు నాణేలు బయటపడ్డాయని గ్రామ సర్పంచ్ సంతోషీలాల్ ఠాకూర్ తెలిపారు. అయితే పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ రాజేంద్ర పరిహార్ మాత్రం ఇప్పటి వరకు కేవలం 20 నుంచి 25 నాణేలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం ఎంత మందికి నాణేలు లభించాయి? ఆ ప్రాంతంలో ఇంకా నాణేలు పాతిపెట్టి ఉన్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ నాణేల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి నిపుణులను కూడా పిలిపిస్తున్నారు. అవి నిజంగానే ప్రాచీన కాలానికి చెందినవైతే ఏ శకానికి సంబంధించినవో తెలుసుకోవడానికి పరిశోధన చేపట్టనున్నారు. ఈ నాణేలు బయటపడిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికారుల నివేదిక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆటో అన్న.. నీ ఐడియా అదుర్స్.. ఏం చేశాడో తెలిస్తే షాకే వీడియో
చీకట్లో నడిచి వెళ్తున్న రైతు.. ఎదురుగ కనిపించింది చూసి భయంతో వీడియో
తల్లికి రెండో పెళ్లి చేసిన 12 ఏళ్ల కూతురు వీడియో
పాపం దానికి తెల్వదు స్నేహితుడు ఇక లేడని.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

