AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?

గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?

Phani CH
|

Updated on: Sep 11, 2026 | 7:38 PM

Share

వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆధ్యాత్మిక నమ్మకాలు చెబుతున్నాయి. తొండం ఎడమవైపు ఉన్న వామముఖి గణేశుడు, ప్రశాంతంగా కూర్చున్న భంగిమ, పసుపు, తెలుపు లేదా సింధూర రంగు విగ్రహాలను శుభప్రదంగా భావిస్తారు. విగ్రహంలో మోదకం, మూషికం ఉండేలా చూసుకోవాలని, పగుళ్లు లేని ప్రతిమను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పర్యావరణ హితంగా సహజ మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.

మరో నాలుగు రోజుల్లో వినాయక చవితి రాబోతోంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీధుల్లో, మండపాల్లో వినాయకులను ప్రతిష్టించేందుకు సన్నాహాలు మొదలైపోయాయి. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమై, సెప్టెంబర్ 25 అనంత చతుర్ధశి రోజున గణపతి నిమజ్జనంతో ఈ పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్లలో కొత్త గణేశ విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే, ఇంటికి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం కొన్ని ముఖ్యమైన నియమాలను విధిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన విగ్రహాన్ని ఎంచుకోవడం ద్వారా ఇంటికి సిరిసంపదలు, సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తారు. నిపుణుల ప్రకారం.. మనం పూజ కోసం ఎంచుకునే గణేశ విగ్రహానికి తొండం ఎడమ వైపునకు తిరిగి ఉండటం అత్యంత శుభప్రదం అని చెబుతారు. దీనిని వామముఖి గణేశుడిగా పిలుస్తారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని, సౌభాగ్యాలను తీసుకువస్తుంది. అలాగే విగ్రహం ఎల్లప్పుడూ ప్రశాంతంగా కూర్చున్న భంగిమలోనే ఉండాలి. ఇది కుటుంబంలో ఐక్యతను, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఇక రంగు విషయానికి వస్తే పసుపు, తెలుపు లేదా సింధూర వర్ణంలో ఉన్న విగ్రహాలు శ్రేయస్కరం. నల్ల రంగు విగ్రహాలను ఇంట్లో ఉంచకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అదేవిధంగా విగ్రహంలో గణేశుడికి అత్యంత ప్రియమైన మోదకం, అలాగే ఆయన వాహనమైన మూషికం ప్రతిమలో తప్పక ఉండేలా చూసుకోవాలి. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని హానికరమైన రసాయనాలతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా, సహజ మట్టితో తయారు చేసిన ప్రతిమలను లేదా ఇత్తడి, వెండి, పాలరాతి విగ్రహాలను ఎంచుకోవడం ఉత్తమం. కొనుగోలు చేసే సమయంలో విగ్రహానికి ఎక్కడా పగుళ్లు లేదా విరిగిన భాగాలు లేకుండా చూసుకోవాలి. పూజా మందిరానికి సరిపోయే పరిమాణంలో ఉండే విగ్రహాన్ని ఎంచుకుని, దానిని ఇంటికి ఈశాన్య లేదా తూర్పు దిశలో ప్రతిష్ఠించడం వల్ల గణేషుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాదగా ఉండదు..

ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు! వైరల్ అవుతున్న కియారా, సిద్ధార్థ్ కొత్త ఫోటో!

Hyderabad: ఆర్టీసీ నైట్​ సర్వీసులు షురూ – హైదరాబాద్‌లో ఇక 24/7 బస్సులు

Irumudi OTT: గుడ్ న్యూస్ OTTలోకి ఇరుముడి!

Follow Us