Current Shock : పెనువిషాదంగా మారిన గృహప్రవేశం వేడుక.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా..
అప్పటివరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు చూస్తుండగానే విగతజీవిగా మారి అనంత లోకాలకు వెళ్లిపోతే ఎలా ఉంటుంది. అందులోనూ.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు-నలుగురు.. వాళ్లు కూడా ఓకే కుటుంబానికి చెందినవాళ్లు.. ఊహించడానికే కష్టంగా ఉంది..
జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం కానుకమాకులపల్లెలో ఓ కుటుంబం కొత్తగా ఇంటిని నిర్మించుకుని గృహప్రవేశానికి సిద్ధమైంది. ఇంటిముందు టెంట్ ఏర్పాటుచేశారు. బంధుమిత్రులంతా గృహప్రవేశ కార్యక్రమ నిర్వహణకోసం హడావిడిగా పనులు చేస్తూ ఉన్నారు. ఇంతలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పెను గాలులు వీచాయి. దాంతో టెంట్ కూలి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడింది. ఆ టెంట్లో ఉన్న నలుగురు విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి ఇద్దరు స్పాట్లోనే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని బి కొత్తకోట మండలంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక.. మృతులను లక్ష్మమ్మ, శాంతమ్మ, లక్ష్మన్న, ప్రశాంత్గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వేడుక జరుగుతున్న ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. శుభాకార్యం జరగాల్సిన ఇంట విషాద ఘటనతో చావు మేళం మోగింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

