కిడ్నాపర్లనుకొని కొత్త వాళ్ళను చితగొడుతున్న జనం.. వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు

ములుగు జిల్లా ప్రజలు కిడ్నాప్‌ల భయంతో హడలిపోతున్నారు. జిల్లాలో పిల్లలను కిడ్నాప్‌ చేస్తున్నారనే వార్తలు జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. దాంతో అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వారిపై గ్రామస్తులు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పంజాబిడ్రస్‌ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతడిని బంధించి దాడిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

కిడ్నాపర్లనుకొని కొత్త వాళ్ళను చితగొడుతున్న జనం.. వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు

|

Updated on: Feb 15, 2024 | 4:26 PM

ములుగు జిల్లా ప్రజలు కిడ్నాప్‌ల భయంతో హడలిపోతున్నారు. జిల్లాలో పిల్లలను కిడ్నాప్‌ చేస్తున్నారనే వార్తలు జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. దాంతో అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వారిపై గ్రామస్తులు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పంజాబిడ్రస్‌ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతడిని బంధించి దాడిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. జిల్లా కలెక్టర్‌ ఆఫీసు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ వ్యక్తిని పట్టుకొని, కొట్టి పోలీసులకు అప్పగించారు స్థానికులు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అతను కిడ్నాపర్‌కాదని తేలింది. దాంతో పుకార్లు నమ్మి అమాయకులపై దాడులకు పాల్పడవద్దని పోలీసులు గ్రామస్తులకు సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Putin – Elon Musk: రష్యా ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడును చంపేస్తారా ??

ఎక్సైజ్ సీఐ బదిలీ.. కన్నీటి పర్యంతమైన నిరుద్యోగులు.. ఎందుకంటే ??

ఈ రోజున అక్షరాలు దిద్దిస్తే.. అద్భుతాలు జరుగుతాయా ??

Medaram Jatara 2024: కోటి మంది వచ్చే జాతర.. కన్నుల పండువగా మొదలైంది

Ratha Saptami: ఫిబ్రవరి 16న రథసప్తమి.. ఆ రోజు ఏమి చేయాలంటే ??

 

Follow us