Veterinary Hospital: పశువుల ఆసుపత్రిని ముట్టడించిన మూగ జీవాలు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
ఎక్కడైనా సమస్యలు పరిష్కరించాలని మనషులు ఆందోళన చేయడం చూశాం.. కానీ తాజాగా తమ గోడు పట్టించుకోవడంలేదంటూ.. మూగ జీవాలు ఆసుపత్రిని ముట్టడించాయి.
ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలం ముగిసిన మందులు కారణంగా రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆగ్రహం చెందిన గొర్రెల పెంపకం దారులు వినూత్న రీతిలో ఆందోళన బాటపట్టారు. మేకలు, గొర్రెలతో పశువుల ఆసుపత్రి ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. గతకొంతకాలంగా పశువైద్యశాలలు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత, అందుబాటులో లేని మందులు, శిథిలావస్థలో ఆసుపత్రుల భవనాలు ఇలా అనేక సమస్యలు పశువులకు వైద్యాన్ని దూరం చేస్తున్నాయి. దీంతో వేంసూరు మండలం చౌడారంలో వినూత్న రీతిలో రైతులు నిరసన తెలిపారు. పశువుల ఆసుపత్రి సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని ఆరోపించారు. వెటర్నరీ వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తున్నాయని మండిపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్కు మేయర్ ప్రకటన..
రూబిక్ క్యూబ్స్తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్
దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
తుపాకులు వదిలి.. క్యాట్వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు

