Veterinary Hospital: పశువుల ఆసుపత్రిని ముట్టడించిన మూగ జీవాలు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
ఎక్కడైనా సమస్యలు పరిష్కరించాలని మనషులు ఆందోళన చేయడం చూశాం.. కానీ తాజాగా తమ గోడు పట్టించుకోవడంలేదంటూ.. మూగ జీవాలు ఆసుపత్రిని ముట్టడించాయి.
ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలం ముగిసిన మందులు కారణంగా రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆగ్రహం చెందిన గొర్రెల పెంపకం దారులు వినూత్న రీతిలో ఆందోళన బాటపట్టారు. మేకలు, గొర్రెలతో పశువుల ఆసుపత్రి ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. గతకొంతకాలంగా పశువైద్యశాలలు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత, అందుబాటులో లేని మందులు, శిథిలావస్థలో ఆసుపత్రుల భవనాలు ఇలా అనేక సమస్యలు పశువులకు వైద్యాన్ని దూరం చేస్తున్నాయి. దీంతో వేంసూరు మండలం చౌడారంలో వినూత్న రీతిలో రైతులు నిరసన తెలిపారు. పశువుల ఆసుపత్రి సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని ఆరోపించారు. వెటర్నరీ వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తున్నాయని మండిపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్కు మేయర్ ప్రకటన..
వీళ్లు అసలు మనుషులేనా ??
తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం
ఎవడ్రా వీడు.. మటన్ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..
బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..
అత్తాపూర్లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం

