Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్‌ బంకులో లైటర్‌ వెలిగించిన ఆకతాయిలు.. ఆ తర్వాత ??

పెట్రోల్‌ బంకులో లైటర్‌ వెలిగించిన ఆకతాయిలు.. ఆ తర్వాత ??

Phani CH

|

Updated on: Nov 02, 2024 | 9:08 AM

మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆకతాయిలు పెట్రోల్‌ బంకులో హల్‌చల్ చేశారు. వాహనదారులు తమ వాహనాలకు పెట్రోల్ కొట్టించుకుంటూ ఉండగా.. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న లైటర్‌ను వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన పెట్రోల్‌ బంక్‌ నిర్వహకులు మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది.

లేదంటే ఊహించని దారుణం జరిగేది. ఈ షాకింగ్‌ ఘటన నాచారంలో శనివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటీజే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని నాచారం పీఎస్ పరిధిలో పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కొడుతుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆకతాయిలు పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చారు. వీరిద్దరూ డేరింగ్‌కు సంబంధించి బెట్‌ కాశారు. వీరిలో చిరన్‌ అనే వ్చక్తి వద్ద లైటర్‌ ఉంది. అతను అరుణ్‌ తో లైటర్‌ వెలిగిస్తావా అని అడిగాడు. దమ్ముంటే నువ్వు వెలిగించు చూద్దాం.. అంటూ రెచ్చగొట్టాడు. దీంతో రెచ్చిపోయిన మొదటి వ్యక్తి లైటర్‌ను వెలిగించాడు. దీంతో పక్కనే పెట్రోల్‌ నింపుతున్న వాహనంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బంకు సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగిన సమయంలో అక్కడ ఓ మహిళ, మరో చిన్నారితో సహా పలువురు వ్యక్తులు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న నాచారం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు చిరన్, అరుణ్ ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ బీహార్‌కు చెందిన వారిగా తెలిపారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మంటలు అంటుకోవడంతో భయంతో అందరూ దూరంగా పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంటి కింద కొబ్బరి నూనెతో మసాజ్‌.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా !!

అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. ఆ త‌ర్వాత ఊహించలేరు