జాతి వైరాన్ని మరిచి.. మాతృత్వాన్ని పంచిన శునకం
అమ్మంటే అమ్మే.. శత్రువుకైనా కడుపునిండా అన్నం పెట్టగలిగేది అమ్మే. ఇది మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ జరుగుతుంది. తాజాగా ఓ శునకం జాతి వైరాన్ని మరచి మేక పిల్లను హక్కున చేర్చుకుని తన పిల్లలతో పాటు పాలిచ్చి కడుపు నింపింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం భగవాన్ పూర్ లో చోటు చేసుకుంది. అసలే ఈ మధ్య ఎక్కడ చూసినా మేకల మందలపై కుక్కల దాడి.. చిన్నారుల పై వీది కుక్కల దాడి..
అమ్మంటే అమ్మే.. శత్రువుకైనా కడుపునిండా అన్నం పెట్టగలిగేది అమ్మే. ఇది మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ జరుగుతుంది. తాజాగా ఓ శునకం జాతి వైరాన్ని మరచి మేక పిల్లను హక్కున చేర్చుకుని తన పిల్లలతో పాటు పాలిచ్చి కడుపు నింపింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం భగవాన్ పూర్ లో చోటు చేసుకుంది. అసలే ఈ మధ్య ఎక్కడ చూసినా మేకల మందలపై కుక్కల దాడి.. చిన్నారుల పై వీది కుక్కల దాడి.. వార్తలే వినిపిస్తున్న ఈ సమయంలో మాతృత్వాన్ని చాటిన ఈ శునకం వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. జాతి వైరం మరిచి మాతృత్వపు మాధుర్యం పంచిన ఈ శునకం తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. భగవాన్ పూర్ గ్రామంలో యువరాజ్ అనే యువకుడికి చెందిన పెంపుడు శునకం మూడు పిల్లలకు జన్మ నిచ్చింది. తన పిల్లలకు ఆ శునకం పాలు ఇవ్వగా చూసిన మేక పిల్ల దగ్గరకు వెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. ఆ శునకం కూడా ఏమీ అనకుండా తన పిల్లలతో పాటు ఆ మేక పిల్లకు సైతం చనుబాలు ఇచ్చి ఆకలి తీర్చింది. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్కటైన కోనసీమ కుర్రది.. స్పెయిన్ కుర్రాడు..
భర్త మరణం.. గర్భం తొలగించుకోడానికి కోర్టును ఆశ్రయించిన మహిళ
నిజామాబాద్లో వింత ఘటన.. వేపచెట్టు నుంచి కారుతున్న కల్లు.. ఎగబడుతున్న జనం
KA Paul: అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా
Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

