Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత ఆచారం.. దేవుడికి తేళ్లతో నైవేద్యం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు

వింత ఆచారం.. దేవుడికి తేళ్లతో నైవేద్యం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు

Phani CH

|

Updated on: Sep 07, 2023 | 9:45 AM

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, సంప్రదాయం ఉంటుంది. అయితే కొన్ని ఆచారాలు విచిత్రంగా అనిపిస్తాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ గుడిలో దేవునికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. తేళ్లేవిటి... నైవేద్యం ఏవిటి అనుకుంటున్నారా... ఆ కథా కమామీషు ఏంటో తెలుసుకుందాం.. కోడుమూరు కొండపై వెలసిన కొండల రాయుడుగా కొలుచుకునే శ్రీవేంకటేశ్వరస్వామికి తేళ్లతో నైవేద్యం పెట్టడం ఆనవాయితీ గా వస్తోంది.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, సంప్రదాయం ఉంటుంది. అయితే కొన్ని ఆచారాలు విచిత్రంగా అనిపిస్తాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ గుడిలో దేవునికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. తేళ్లేవిటి… నైవేద్యం ఏవిటి అనుకుంటున్నారా… ఆ కథా కమామీషు ఏంటో తెలుసుకుందాం.. కోడుమూరు కొండపై వెలసిన కొండల రాయుడుగా కొలుచుకునే శ్రీవేంకటేశ్వరస్వామికి తేళ్లతో నైవేద్యం పెట్టడం ఆనవాయితీ గా వస్తోంది. ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడవ సోమవారం ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. తేళ్లను చేతుల పైన, తలపైన, ముఖం పైన, చివరికి నాలుక పైన పెట్టుకున్నా అవి తమకు ఎలాంటి హానీ తలపెట్టవని భక్తులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున అది కరిచినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు విషం విరుగుడై నొప్పి మటుమాయం అవుతుందంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో తల్లిదండ్రులకు దూరం కానున్న భారత సంతతి పిల్లలు !!

మియామీ తీరంలో అలలపై తేలియాడిన ట్రంప్ కూతురు ఇవాంక

ఇంజిన్‌ లేకుండానే కదిలిన రైలు !! ఆశ్చర్యంలో రైల్వే అధికారులు

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై అఘాయిత్యం.. ఆపై అమ్మేసిన పోలీసులు