AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..

Viral: దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..

Anil kumar poka
|

Updated on: Nov 26, 2024 | 11:49 AM

Share

భద్రాచలంలోని సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో అతి పవిత్రంగా భావించేవి తలంబ్రాలు. అయితే కోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా ప్రత్యేకంగా పండించిన వరి పంట కోత పూర్తయ్యింది. స్వయంగా ఆ రామ, లక్ష్ణణులు సహా వానర సేన వేషాల్లో రైతులు ఈ కోటి తలంబ్రాల పంట కోత మహాయజ్ఞంలో పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం అచ్చుతాపురం లోని శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 14వ సారి రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు మహా యజ్ఞ కోసం వేసిన రెండు ఎకరాల పంట పొలంలో వరి కోతను కోసి కోటి తలంబ్రాలుగా రాములోనికి సమర్పించింది వానర సైన్యం. ఉదయం ముందుగానే రాములోరికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం పంటను కోచి ఆ కోసిన పంటను మోసుకుని వెళ్లి ఒకచోట ధాన్యాన్ని వలిచి రాములోరి పాదాల ముందు శ్రీరామ అంటూ కోటి తలంబ్రాలు సమర్పించారు.. రాముడు, లక్ష్మణుడు,హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగజుడు, విశ్వామిత్రుడు వేషధారణలో కోటి తలంబ్రాల యజ్ఞానికి నేడు శ్రీకారం చుట్టారు.

రాబోయే రాముల వారి కళ్యాణానికి ఈ వడ్ల గింజలు గోటితో వలిచి భద్రాద్రి, అయోధ్య, ఒంటిమిట్ట వంటి రాముల వారి క్షేత్రాలకు కళ్యాణానికి తలంబ్రాల ఇక్కడి నుంచే పంపిస్తామని శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు కళ్యాణ అప్పారావు తెలిపారు.రాములోరి కళ్యాణానికి ప్రతి ఏటా ఇటువంటి పురుగు మందులు కొట్టకుండా నేచురల్ గా వరి పంటను పండిస్తారు. రాములోరి కళ్యాణానికి పంపించే కోటి తలంబ్రాలు మహా యజ్ఞంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని రాజమహేంద్రవరం కి చెందిన జానపద కళాకారులు బృందం సభ్యులు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.