Crocodile: గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్చల్ చేసింది ఓ భారీ మొసలి. అటుగా వెళ్తున్న పశువుల కాపరి దానిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అయితే దూరాన్నుంచి దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా అటవీశాఖాధికారుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగారు.
తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలంలోని ములకల్లంక శివారున గోదావరి పాయలో మొసలి కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ములకల్లంక గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉత్తరం వైపున గోదావరి నీరు కొలనుగా ఏర్పడింది. అందులో మొసలి ఒడ్డుకు వచ్చి ఉండటం పశువుల కాపరి చూసి ఫొటో తీశాడు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో అటవీ శాఖాధికారులు మొసలి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం పంపిస్తామని తెలిపారు. వారి సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

