కాకి బిర్యానీ కోసం 19 కాకులను చంపిన దంపతులు
వెజ్ బిర్యానీ మాత్రమే కాదు చికెన్ బిర్యానీ , ఎగ్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ వంటి రకరకాల బిర్యానీలు మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటారు. అయితే ఒక జంటకు వింత కోరిక కలిగి నట్లు ఉంది.. కాకుల ను చంపి ఆ మాసంతో ఏకంగా విందుకి రెడీ అవుతున్నారు. కాకి మాంసం అనగానే సునీల్ నటించిన ఓ ఫన్నీ సీన్ గుర్తుకొస్తుంది. ఓ కాకా హోటల్ లో సునీల్ చికెన్ బిర్యానీ తింటాడు.
తర్వాత కాకిలా అరవడం మొదలపెడతాడు. ఆ తర్వాత తాను తిండి కోడి బిర్యానీ కాదని కాకి బిర్యానీ అని తెలిసి షాక్ తింటారు. కాకి మాసంతో విందు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని , తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. తిరువళ్లూరులోని ఓ గ్రామంలో కాకులను చంపి మాసంతో బిర్యానీ చేయడానికి రెడీ అయిన జంటకు అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు జరిమానా కూడా విధించింది. తోరైపాక్కం గ్రామంలో రమేష్, భూచమ్మ అనే దంపతులు కాకులను చంపుతున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రమేష్ దంపతుల ఇంట్లో సోదాలు చేసి ఇంట్లో ఉన్న 19 కాకులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

