రిషి కుటుంబానికి గోల్డెన్‌ డేస్‌.. భార్య అక్షతా మూర్తికి బంపరాఫర్‌ !!

Updated on: Nov 02, 2022 | 9:25 AM

బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌కు గోల్డెన్‌ డేస్‌ నడుస్తున్నాయి. లేటెస్ట్‌గా రిషి సునాక్ భార్య అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌ నుంచి భారీ డివిడెండ్‌ దక్కింది.

బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌కు గోల్డెన్‌ డేస్‌ నడుస్తున్నాయి. లేటెస్ట్‌గా రిషి సునాక్ భార్య అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌ నుంచి భారీ డివిడెండ్‌ దక్కింది. అక్షత ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె. అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో భారీగా షేర్లు ఉన్నాయి. 2022 సంవత్సరానికి గానూ అక్షతకు తన వాటాలపై డివిడెండ్‌ రూపంలో 126 కోట్లుపైనే ఆదాయం లభించింది. అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో 0.93 శాతం వాటా ఉంది. ఆమె పేరుతో 5,956 కోట్ల విలువ చేసే షేర్లు ఉన్నాయి. ఈ ఏడాది మే 31న 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్ ఒక్కో షేరుపై 16 చొప్పున డివిడెండ్ చెల్లించింది. మే నుంచి అక్టోబరు వరకు 16.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీంతో ఒక్కో షేరుపై మొత్తం డివిడెండ్ 32.5 కాగా, అక్షత మూర్తికి తన వాటాలపై డివిడెండ్‌ రూపంలో 126.61 కోట్ల ఆదాయం వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలెంట్‌ ఉంటే అంతే !! కాంతార హీరో వెంటపడుతోన్న బాలీవుడ్

విడాకులకు ముందే.. ఈ వ్యాధి గురించి తెలుసు ??

Vishal: అమ్మాయిల విషయంలో దారుణంగా విశాల్ తీరు..

Puri Jagannadh: ‘చూడు బాస్’.. అంటూనే.. ఇచ్చిపడేసిన పూరీ

“ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి”

Published on: Nov 02, 2022 09:25 AM
Loading...
Unable to load recommendations.
Follow Us