Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో

పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో

Samatha J

|

Updated on: Apr 10, 2025 | 7:28 PM

పెళ్లి వేడుకలో ‘జూతా చుపాయి’ అంటే చెప్పులు దాచిపెట్టడం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వధూవరుల కుటుంబాలు కలబడి కొట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిందీ ఘటన. దాచిపెట్టిన చెప్పులు ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేయగా, పెళ్లి కొడుకు రూ. 5 వేలు మాత్రమే ఇవ్వడంతో గొడవ ప్రారంభమైంది. వధువు తరపు మహిళ పెళ్లి కొడుకును బిచ్చగాడిగా అభివర్ణించడంతో గొడవ ముదిరింది.అంతేకాదు, పెళ్లికొడుకును ఓ గదిలో బంధించి వధువు తరపు బంధువులు కర్రలతో చితకబాదారు. వరుడు ముహమ్మద్ షాబిర్ ఏప్రిల్‌ 5న తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్‌లోని చక్రట నుంచి ఊరేగింపుగా బిజ్నోర్ చేరుకున్నాడు

. వివాహ ఆచారంలో భాగంగా వధువు వదిన వరుడు షాబిర్ బూట్లను దొంగిలించింది. వాటిని తిరిగి ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేసింది. అయితే, షాబిర్ మాత్రం రూ. 5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో వధువు కుటుంబంలోని మహిళలు పెళ్లి కొడుకును బిచ్చగాడిగా అభివర్ణించారు.దీంతో వధూవరుల కుటుంబల మధ్య వాగ్వివాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులు వరుడు, అతడి కుటుంబ సభ్యులను ఓ గదిలో బంధించి కర్రలతో వారిని చితకబాదారు. అయితే, వధువు కుటుంబ సభ్యులు మాత్రం మరోలా చెబుతున్నారు.పెళ్లికొడుకు కుటుంబం పెట్టిన బంగారం నాణ్యతను ప్రశ్నించడంతో గొడవ మొదలైందని చెప్పారు. వారికి తమ కుమార్తె కంటే డబ్బులే ఎక్కువైపోయాయని ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలను సముదాయించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు నజీబాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం 

గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఎలుక..ఎందుకో తెలిస్తే షాకవుతారు వీడియో

శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో

అయ్యో.. ఈ కండక్టర్‌ కష్టాలు ఎవరికీ రాకూడదు..వీడియో

క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన విద్యార్థి.. ఏం జరిగిందంటే వీడియో