Anantapur: బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్లోకి ఎంటరయిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి
కల్యాణదుర్గంలో భల్లూకం బెంబేలెత్తించింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్లోకి ప్రవేశించింది. మనుషులు ఎదురుపడినప్పుడు ఇవి షాక్కు గురయ్యి, ఆ తర్వాత తమను తాము కాపాడుకొనే క్రమంలో దాడులు చేస్తాయి.. అందుకే భల్లూకం సంచరించే ప్రాంతాల్లో జనాలు అలెర్ట్గా ఉండాలి.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఓ ఎలుగుబంటి జనావాసాల్లోకి చొరబడింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దొడగట్టరోడ్ మార్కెడ్ యార్డ్ ఎదురుగా ఉన్న బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్లోకి ప్రవేశించింది భల్లూకం. 15 నిమిషాలపాటు సంచరించిన ఎలుగుబంటి..చివరకు తలుపులు పగులగొట్టి బిస్కెట్ బాక్సులు చింపివేసింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ ప్రాంతంలో నిత్యం ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్టు సిబ్బంది చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jul 29, 2024 09:23 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

