బ్యాంకునుంచి నగదు డ్రా చేస్తున్నారా..జాగ్రత్త వీడియో
బ్యాంకు నుంచి నగదు డ్రా చేసేవారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. రూ.2 లక్షలు డ్రా చేసుకుని బయట బైక్పై ఉంచిన శ్రీనును దొంగలు వెంబడించి, హోటల్ వద్ద ఆగినప్పుడు నగదును అపహరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నారు. బ్యాంకుల వద్ద సాధారణ ప్రజల్లాగే తిరుగుతూ రెక్కీ నిర్వహించి, తమదైన శైలిలో డబ్బులు కొట్టేయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ఈ తరహా ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటుచేసుకుంది. నర్సాపురం మండలం వేములదీవి గ్రామానికి చెందిన ఉంగరాల శ్రీను పట్టణంలోని ఎస్.బి.ఐ బ్యాంకు నుంచి రెండు లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారు. ఆ నగదును తన బుల్లెట్ బైక్ ట్యాంక్ పై ఉన్న కవర్లో ఉంచారు. అనంతరం ఇంటికి వెళ్తూ పంజా సెంటర్ లోని ఒక హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి ఆగారు. బైక్ పై డబ్బు ఉందన్న విషయం మర్చిపోయి, శ్రీను హోటల్లోకి వెళ్లగానే, బ్యాంకు నుంచి వెంబడించిన ఇద్దరు వ్యక్తులు బైక్ కవర్లో ఉన్న రెండు లక్షల రూపాయలను చాకచక్యంగా అపహరించారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

