మాట జారాను.. మన్నించండి వీడియో
మంత్రి కొండా సురేఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల అర్ధరాత్రి ట్వీట్ ద్వారా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జున పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో, రేపు నాంపల్లి కోర్టులో విచారణకు ముందు ఈ క్షమాపణ చేశారు. తన వ్యాఖ్యలు నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. గతంలో నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఆమె అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ఆయన బాధపడి ఉంటే చింతిస్తున్నానని పేర్కొంటూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన వ్యాఖ్యలతో షాక్కు గురయ్యానని, అక్కినేని కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిందని నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతోంది. రేపు నాంపల్లి కోర్టులో మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో కొండా సురేఖ ఈ క్షమాపణ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్కు వచ్చి.. ఆర్టిస్ట్కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

