మాట జారాను.. మన్నించండి వీడియో
మంత్రి కొండా సురేఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల అర్ధరాత్రి ట్వీట్ ద్వారా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జున పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో, రేపు నాంపల్లి కోర్టులో విచారణకు ముందు ఈ క్షమాపణ చేశారు. తన వ్యాఖ్యలు నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. గతంలో నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఆమె అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ఆయన బాధపడి ఉంటే చింతిస్తున్నానని పేర్కొంటూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన వ్యాఖ్యలతో షాక్కు గురయ్యానని, అక్కినేని కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిందని నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతోంది. రేపు నాంపల్లి కోర్టులో మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో కొండా సురేఖ ఈ క్షమాపణ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్..
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!
సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం
రీల్స్ సరదా.. నిండు ప్రాణం బలి
అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

