Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మట్టి తవ్వుతుండగా ఏదో శబ్దం.. ఇంకాస్త లోతుగా తవ్వగా.. ఆశ్చర్యకరంగా

మట్టి తవ్వుతుండగా ఏదో శబ్దం.. ఇంకాస్త లోతుగా తవ్వగా.. ఆశ్చర్యకరంగా

Phani CH

|

Updated on: Jun 07, 2025 | 12:43 PM

కాలక్రమేణా మట్టిలో కలిసిపోయిన అనేక అద్భుతాలు తవ్వకాల్లో తరచూ బయటపడుతూ తమ ఉనికిని చాటుకుంటాయి. పురాతన విగ్రహాలు.. చారిత్రక అవశేషాలు ఎన్నో బయటపడ్డాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలోని జముయి జిల్లాలోని మంజోష్ గ్రామంలో ఇటీవలి తవ్వకాల సమయంలో ఒక అరుదైన ఘటన వెలుగుచూసింది. ఓ పురాతన విగ్రహం బయటపడింది.

ఈ విగ్రహం సుమారు 1,700–1,800 సంవత్సరాల నాటి పాళ వంశం ప్రారంభ కాలానికి చెందినదిగా నిపుణులు భావిస్తున్నారు. శివుడు, పార్వతిదేవి ఒకే రూపంలో ఏకశిలపై ఉన్న ఉమామహేశ్వర విగ్రహం గ్రామస్థులను, అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఖైరా టోళాలోని కోల్హువా పోఖర్ సమీపంలో కొంతమంది గ్రామస్తులు తవ్వకాలు జరుపుతుండగా వారికి ఓ శబ్దం వినిపించింది. జాగ్రత్తగా ఇంకాస్త లోతుగా తవ్వగా అందమైన పురాతన విగ్రహం వెలుగుచూసింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో జనాలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. గ్రామస్థులు ఈ విగ్రహాన్ని స్థానిక ఆలయం వద్ద ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ విషయం అధికారులకు చేరడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, ఈ విగ్రహాన్ని మ్యూజియంకు అప్పగించాలని కోరారు. ఇది జాతీయ వారసత్వం కాబట్టి శాస్త్రీయంగా సంరక్షించాల్సి ఉంటుందని వారికి వివరించారు. అయితే విగ్రహం తమ ఆథ్యాత్మిక నమ్మకం, విశ్వాసానికి సంబంధించినది.. కనుక విగ్రహం తమ గ్రామంలోనే ఉండాలని పట్టుబట్టారు. దీంతో అధికారులు, గ్రామస్థుల మధ్య వాడీవేడీ చర్చకు దారితీసింది. బీహార్ మ్యూజియంకు చెందిన పురావస్తు నిపుణుడు డా. రవి శంకర్ గుప్త ఈ విగ్రహాన్ని పరిశీలించారు. ఇది పాళ వంశపు ప్రారంభకాలానికి చెందినదిగా నిర్ధారించారు. “ఉమామహేశ్వర విగ్రహం హిందూ ధార్మిక కళారూపానికి చెందిన అరుదైన, మహత్తర నిధి,” అని ఆయన తెలిపారు. విగ్రహంపై శివుడు నందిపై, పార్వతిదేవి సింహంపై కూర్చున్నట్లుగా ఉంది. శివుని జటాలు స్పష్టంగా చెక్కబడి ఉంటే.. సర్వాభరణాలతో అలంకరించబడి, లలితాసనంలోఉన్న పార్వతి దేవీ శివుని వైపు చూస్తూ ఉన్నారు. ఇలాంటి విగ్రహాలు చాలా అరుదైనవని డా. గుప్త చెప్పారు. ఈ విగ్రహాన్ని గ్రామంలోనే ఉంచి గుడి కట్టి పూజలు చేయాలా లేదా శాస్త్రీయ సంరక్షణ కోసం మ్యూజియంకు అప్పగించాలా అన్న అంశం గ్రామస్థుల, అధికారుల మధ్య చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మృత్యుంజయులు.. వంతెనపైనుంచి 50 అడుగుల లోతులో పడిన కారు

నిద్రపోదామని రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తి.. దిండుకింద ఏదో కదలిక.. చూస్తే

చేపలు నడవడం చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే

కొబ్బరి నీళ్లతో జుట్టు సమస్యలకు చెక్‌!

గేటు దాటుతుండగా ట్రాక్‌పై ఇరుక్కుపోయిన ఈ-రిక్షా.. ఇంతలో