పెంపుడు కుక్క మృతి.. దాని చైన్తోనే ఉరేసుకున్న యజమాని
కుక్కలంటే మనుషులకు అత్యంత ప్రేమ. పెంపుడు జంతువులు.. మన జీవన శైలిలో ఓ భాగం. అయితే ఆ మూగ జీవాలను ప్రాణప్రదంగా భావించేవారు కోకొల్లలు. కంటికి రెప్పలా కాస్తూ.. విడదీయరాని మైత్రి బంధాన్ని కొనసాగించే వారు మరికొందరు. మనుషుల్లానే చలికాలంలో వాటికీ రక్షణ అవసరమే.. అందుకే జంతు ప్రేమికులు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటిపట్ల జాగ్రత్తగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మనుషుల మాదిరిగానే వాటికీ సీజనల్ వ్యాధులు వస్తాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని జీర్ణించుకోలేక రాజశేఖర్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హెగ్గడదేవనపురలో నివాసం ఉండే రాజశేఖర్ తొమ్మిదేళ్లుగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. దాని పేరు బౌన్సీ. అయితే, ఆ శునకం అనారోగ్యంతో మంగళవారం నాడు చనిపోయింది. దాంతో అదే రోజు తన వ్యవసాయ క్షేత్రంలో దాని అంత్యక్రియలు నిర్వహించాడు. ప్రాణంగా చూసుకున్న బౌన్సీని కోల్పోవడం రాజశేఖర్ను తీవ్రంగా కలిచివేసింది. దాని మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా బౌన్సీని కట్టడానికి ఉపయోగించిన చైన్తోనే ఉరేసుకున్నాడు. బుధవారం ఉదయం తన ఇంట్లో శవమై కనిపించాడు. ఈ ఘటనపై మదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

