Viral video: చూస్తుండగానే క్షణంలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైరల్ అవుతున్న యాక్సిడెంట్ దృశ్యాలు..
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, వ్యాను ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లా శివారు పార్థసారధినగర్ సమీపంలో ఉపాధ్యాయులతో వెళ్తున్న వ్యాను ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలవైపున వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి దూరంగా పడిపోయారు, బైకు నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇక వ్యానులోని వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా.. బైక్పైన వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వ్యానులో ప్రయాణిస్తున్నవారంతా ముత్తుకూరు మండలం ఈపురు వెంకన్నపాలెం స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో నెట్టింట చేరి హల్చల్ చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

