నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బాస్..చిరుతకే చుక్కలు చూపించాడుగా!
సాధారణంగా ఎవరైనా చిరుతను చూస్తే ఏం చేస్తారు. వెంటనే అక్కడి నుంచి పరుగు అందుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం చిరుతను చూసి పరిగెత్తకుండా దాని తోకను పట్టుకుని చుక్కలు చూపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని రంగపురలో చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలోని తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని రంగపుర గ్రామంలో ఐదు రోజులుగా చిరుతపులి గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.
ఇక చిరుత పులి కనిపించడంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. కానీ, బోను పెట్టి బంధించేందుకు ప్రయత్నించగా చిరుత తప్పించుకోవాలని చూసింది. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి చిరుతపులి తోకను పట్టుకుని, అది పారిపోకుండా నిలువరించాడు. అనంతరం అధికారులు వల సాయంతో దాన్ని పట్టి బంధించారు. అనంతరం దాన్ని బోనులో వేసి అక్కడ్నించి తరలించారు. తన సాహసోపేతమైన చర్యతో చిరుతను పట్టుకోవడానికి సహకరించిన అతడిని గ్రామస్థులు, అధికారులు అభినందించారు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. యువకుడి ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ

కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..

బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..

భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..

భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో

దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో

రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..
