నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బాస్..చిరుతకే చుక్కలు చూపించాడుగా!
సాధారణంగా ఎవరైనా చిరుతను చూస్తే ఏం చేస్తారు. వెంటనే అక్కడి నుంచి పరుగు అందుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం చిరుతను చూసి పరిగెత్తకుండా దాని తోకను పట్టుకుని చుక్కలు చూపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని రంగపురలో చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలోని తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని రంగపుర గ్రామంలో ఐదు రోజులుగా చిరుతపులి గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.
ఇక చిరుత పులి కనిపించడంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. కానీ, బోను పెట్టి బంధించేందుకు ప్రయత్నించగా చిరుత తప్పించుకోవాలని చూసింది. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి చిరుతపులి తోకను పట్టుకుని, అది పారిపోకుండా నిలువరించాడు. అనంతరం అధికారులు వల సాయంతో దాన్ని పట్టి బంధించారు. అనంతరం దాన్ని బోనులో వేసి అక్కడ్నించి తరలించారు. తన సాహసోపేతమైన చర్యతో చిరుతను పట్టుకోవడానికి సహకరించిన అతడిని గ్రామస్థులు, అధికారులు అభినందించారు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. యువకుడి ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

