పేద కుటుంబాన్ని ఎంచుకుంటాడు. అమ్మాయిలకు బాగా చూసుకుంటానంటూ నమ్మిస్తారు. పెళ్లి చేసుకుని మోజు తీరాక.. పుట్టింట్లో దింపేసి వెళ్లిపోతాడు. మాట్రిమోనీ నిత్య పెళ్లికొడుకు మోసాల తీరిది.ఒకరికి తెలియకుండా మరొకరిని, అలా ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఏకంగా ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు కేటుగాటు. మాట్రిమోనీ ద్వారా యువతులను మోసం చేస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులను ఆశ్రయించింది ఓ బాధితురాలు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మంగళ్లపల్లికి చెందిన సగనమోని మద్దిలేటి అలియాస్ మధుతో… గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతి లీలావిజయదుర్గతో మాట్రిమోని ద్వారా పెళ్లి జరిగింది. అయితే, ఆమె ప్రెగ్నెంట్గా ఉండగా పుట్టింట్లో దింపి వెళ్లిపోయాడు. వెళ్లినోడు మళ్లీ తిరిగి రాకపోవడంతో భర్త కోసం సెర్చింగ్ మొదలుపెట్టింది. వెతగ్గావెతగ్గా, పెద్దపల్లి జిల్లా మంథనిలో మధును గుర్తించింది విజయదుర్గ. ఆరు నెలలక్రితం మరో యువతిని పెళ్లి చేసుకుని, మంథనిలో కాపురం పెట్టినట్టు తెలుసుకుంది. ఇప్పుడున్న ఆమె, ఐదో భార్యని, తాను నాలుగో భార్య అని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!