AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బందిపడిన చిన్నారి..

Viral: చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బందిపడిన చిన్నారి..

Anil kumar poka
|

Updated on: Nov 30, 2024 | 8:31 PM

Share

కేరళలోని తిరువళ్లూరు సమీపంలో బిస్కెట్లు తింటూ ఊపిరాడక 3 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన తిరువళ్లూరు జిల్లా కుమ్మిడిపూండి పక్కన గల కవరప్పెట్టై ప్రాంతంలోని గురువరాజా కందిగై గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో అరికృష్ణన్, అమ్ములు అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి వెంకట లక్ష్మి అనే 3 సంవత్సరాల వయసు గల కుమార్తె ఉంది.

బిస్కెట్లు తింటూ ఊపిరాడక 3 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా కందిగై గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నారి వెంకటలక్ష్మికి టీలో బిస్కెట్లు ముంచి తినిపించారు. ఆ సమయంలో చిన్నారి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. పాపను సెంగున్రం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వెంకటలక్ష్మిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కవార్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిల్లలకు వారి వయస్సు ప్రకారం సరైన ఆహారం ఇవ్వాలని వైద్య నిపుణులు సూచించారు. పిల్లల వయస్సు, ఎదుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా వివిధ రకాల ఆహార పదార్థాల్ని ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ విషయంలో సందేహాలు ఉంటే పిల్లల వైద్య నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.