ఢిల్లీలో నగల దుకాణంలో పద్మభూషన్‌ పతకం అమ్మడానికి యత్నం !!

పద్మభూషన్‌.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఇదీ ఒకటి. అలాంటి పతకం అంగట్లో అమ్మకానికి రావడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న ఆ వ్యక్తికి కూడా తెలియలేదు. ఆ పతకం అమ్మకానికి రావడంతో దుకాణదారుడు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీలో నగల దుకాణంలో పద్మభూషన్‌ పతకం అమ్మడానికి యత్నం !!

|

Updated on: Mar 02, 2024 | 7:39 PM

పద్మభూషన్‌.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఇదీ ఒకటి. అలాంటి పతకం అంగట్లో అమ్మకానికి రావడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న ఆ వ్యక్తికి కూడా తెలియలేదు. ఆ పతకం అమ్మకానికి రావడంతో దుకాణదారుడు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు ప్రకారం.. మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు. ఈ పద్మభూషణ్ పతకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ మెడల్‌పైన పద్మభూషణ్ అని రాసి ఉండటంతో అనుమానం వచ్చిన స్వర్ణకారుడు దానిని కొనేందుకు నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురూ మరో స్వర్ణకారుని సంప్రదించారు. ఈ విషయాన్ని స్వర్ణకారుడు కల్కాజీ పోలీసులకు సమాచారమిచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంజెక్షన్ కోసం నరం దొరక్క.. ఖైదీకి మరణ శిక్ష నిలిపివేత

Srisailam: శ్రీశైలం మల్లన్న ..నీ ఆదాయం పెరిగిందన్నా

వరుడు టైంకు రాలేదని.. బావను పెళ్లాడిన యువతి !!

Follow us