వందేభారత్ ఎక్స్ప్రెస్కు చెందిన స్లీపర్ కోచ్ రైళ్లను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు. నాన్ ఏసీ ప్రయాణికుల కోసం వందే మెట్రో రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. నాన్ ఏసీ పుష్పుల్ రైలులో 22 బోగీలు ఉంటాయి. వందేభారత్ ఏసీ రైళ్లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దేశంలోని పలు నగరాల మధ్య ఆ రైళ్లు నడుస్తున్నాయి. అయితే సుదీర్ఘ దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని, వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ కోచ్లను తీసుకురానున్నట్లు తాజాగా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే స్లీపర్ వర్షన్కు చెందిన వందేభారత్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. వందేభారత్ మెట్రో రైలును కూడా ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రయాన్-3 సాధించిన అరుదైన ఘనత !! వీడియో విడుదల చేసిన యూట్యూబ్ ఇండియా
చాట్జీపీటీ అద్భుతం.. 17 మంది డాక్టర్ల వల్ల కాని పని చేసి చూపిందట
చిప్స్ తిని అస్వస్థతకు గురై చనిపోయిన బాలుడు.. ఛాలెంజ్లో భాగంగా ఘటన
ESI హాస్పిటల్లో దారుణం.. లిఫ్టు ఎక్కడమే పాపమైంది
అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు