AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొక్కే కదా అని లైట్‌ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి

తొక్కే కదా అని లైట్‌ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి

Sudhir Chappidi
| Edited By: Phani CH|

Updated on: Nov 29, 2025 | 2:31 PM

Share

మనిషి ఆరోగ్యానికి తాజా పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు, ఆహార నిపుణులు కూడా పండ్లు, కూరగాయలు తీసుకోమని చెబుతారు. చర్మ సంరక్షణ కూడా ఆరోగ్యంలో భాగమే. ఆరోగ్య రక్షణలో భాగంగా సి విటమిన్‌ కలిగిన పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఇది ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడటంలో ఎంతగానో సహకరిస్తాయి.

మనిషి ఆరోగ్యానికి తాజా పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు, ఆహార నిపుణులు కూడా పండ్లు, కూరగాయలు తీసుకోమని చెబుతారు. చర్మ సంరక్షణ కూడా ఆరోగ్యంలో భాగమే. ఆరోగ్య రక్షణలో భాగంగా సి విటమిన్‌ కలిగిన పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఇది ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడటంలో ఎంతగానో సహకరిస్తాయి. ఈ సిట్రస్‌ పండ్లలో ప్రధానమైనది నారింజపండు. ఇందులో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. అయితే మనం నారింజపండును తిని తొక్కను పడేస్తాం. కానీ ఈ తొక్కవల్ల కూడా చర్మానికి ఎంతో ప్రయోజనముందంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం తొక్కేకదా అని పడేసే నారింజపండు తొక్కలతో అనేక లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందమైన చర్మానికి ఈ తొక్కలు ఎంతగానో దోహదం చేస్తాయి. నారింజ తొక్కలను నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని ఓ డబ్బాలో భద్రపరచుకోవాలి. ఒకచెంచా నారింజపండు తొక్కల పొడిలో ఒక చెంచా బియ్మం పిండి, రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇది ముఖంపై ఉన్న టాన్‌ తొలగిస్తుంది. మృతకణాలను రిమూవ్‌ చేస్తుంది. అలాటే నారింజ తొక్కల పొడిలో కాస్త పెరుగు, తేనె కలిపి కూడా ముఖానికి రాసుకోవచ్చు. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఒక స్పూన్ శనగ పిండి తీసుకుని, అందులో అరస్పూన్ నారింజ తొక్కల పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్‌ చేసుకుంటే ముఖానికి మంచి గ్లో వస్తుంది. అలాగే నారింజ తొక్కల పొడిలో ముల్తానీమిట్టి, చిటికెడు పసుపు, పాలు వేసి కలిపండి..ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా తాజా అలోవెరా జెల్, నాలుగైదు చుక్కల నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి కొంచెం గట్టిగా ఉండే పేస్ట్‌లా చేసుకొని దానిని ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించవచ్చు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్కిన్‌కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

TOP 9 ET News: జక్కన్న కిర్రాక్‌ ప్లాన్ !! ఈ సారి హాలీవుడ్‌ షేకవ్వడం పక్కా

Manchu Lakshmi: వాళ్ల వల్ల నేను అనుభవించిన బాధ.. నా ఒక్కదానికే తెలుసు

మంగ్లీని పచ్చి బూతులు తిడుతూ వీడియో.. దెబ్బకు జైల్లో పెట్టించిన సింగర్

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర