AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోనసీమ జిల్లాలో ఆకట్టుకున్న వినాయకుడి నిమజ్జన విగ్రహాల ఊరేగింపు.. ప్రత్యేకంగా తయారుచేసిన ఎడ్లబండిపై..

కోనసీమ జిల్లాలో ఆకట్టుకున్న వినాయకుడి నిమజ్జన విగ్రహాల ఊరేగింపు.. ప్రత్యేకంగా తయారుచేసిన ఎడ్లబండిపై..

Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Sep 27, 2023 | 8:01 PM

Share

Konaseema District News: హైదరాబాద్‌లో భారీ విగ్రహాలు పెద్ద పెద్ద ట్రాలీలపై వినాయక నిమజ్జనం కోసం వెళ్తుంటే.. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరంలో అతి చిన్న వినాయక విగ్రహాలు నిమజ్జనాల కోసం ట్రాలీలపై గోదావరి నది వద్దకు చేరుతున్నాయి.  బండెనుక బండి అన్నట్లుగా 32 బండ్లపై గణనాథుడు ఊరేగింపు ఘనంగా జరిగింది. అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చాకల పాలెం వద్ద ప్రత్యేకంగా తయారుచేసిన 32 బండ్లపై గణనాధుని వినూత్నంగా..

కోనసీమ జిల్లా, సెప్టెంబర్ 27: హైదరాబాద్‌లో భారీ విగ్రహాలు పెద్ద పెద్ద ట్రాలీలపై వినాయక నిమజ్జనం కోసం వెళ్తుంటే.. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరంలో అతి చిన్న వినాయక విగ్రహాలు నిమజ్జనాల కోసం ట్రాలీలపై గోదావరి నది వద్దకు చేరుతున్నాయి.  బండెనుక బండి అన్నట్లుగా 32 బండ్లపై గణనాథుడు ఊరేగింపు ఘనంగా జరిగింది. అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చాకల పాలెం వద్ద ప్రత్యేకంగా తయారుచేసిన 32 బండ్లపై గణనాధుని వినూత్నంగా ఊరేగించారు. అతి చిన్న వినాయక విగ్రహాలు తయారు చేసి వాటి కోసం ఒక చిన్న ట్రాలీ కూడా తయారు చేసి ట్రాలీపై ఎడ్ల బండి పెట్టి వాటిలో చిన్న చిన్న వినాయక విగ్రహాలు పెట్టి ఊరేగించారు. ఊరేగింపులో మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు అందరూ కలిసి ఉత్సాహంగా ప్రధాన రహదారిపై ముందుకు లాగారు. స్థానికులు ప్రయాణికులు అతి చిన్న గణనాధుని ఊరేగింపు అందరిని ఆకట్టుకుంది. గత 10 ఏళ్లుగా గా ఇదే మాదిరి చిన్న విగ్రహాలు పెట్టి ట్రాలీపై పెట్టి ఊరేగింపు చేస్తున్నామంటున్నారు.

Published on: Sep 27, 2023 07:43 PM