Amit Shah in Adilabad Live: కేసీఆర్‌ను గద్దె దించాలి.. డిసెంబర్‌ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్‌..

Edited By:

Updated on: Oct 10, 2023 | 4:22 PM

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే మొదటిసారి అమిత్‌ షా రాష్ట్రానికి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇవాళ మధ్యాహ్నం అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఆయన  అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ జరిగే జనగర్జన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం ఆదిలాబాద్‌ నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే మొదటిసారి అమిత్‌ షా రాష్ట్రానికి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇవాళ మధ్యాహ్నం అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఆయన  అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆదిలాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ జరిగే జనగర్జన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం ఆదిలాబాద్‌ నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అయితే సాయంత్రం శంషాబాద్‌లో అమిత్‌షా సభ నిర్వహించాలని తొలుత భావించారు. ఈ సభ రద్దు అయింది. దీనికి బదులుగా సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజీలోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్‌ షా పాల్గొంటారు. ఆ సమావేశం తర్వాత బేగంపేటలోని కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. రాత్రి ఐటీసీ కాకతీయలో బీజేపీ క్యాడర్‌తో సమావేశం అవుతారు. తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల వ్యూహాలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు. ఇక రాత్రి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సైబర్ నేరగాళ్ల భారీ స్కెచ్ !! పేమెంట్ గేట్‌ వే నుంచి రూ.వేల కోట్లు చోరీ !!

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పోలీసులు ఏం చేశారో తెలుసా ??

బాంబులా పేలిన ఫ్రిడ్జ్‌.. ఐదుగురు సజీవ దహనం

TOP 9 ET News: ఇట్స్‌ కన్సర్మ్‌! ప్రభాస్-లోకి సినిమా సెట్టు | రచ్చలేపుతున్న బాలయ్య కామెంట్స్

Sridevi: ఆమె చావుకు కారణం ‘ఉప్పు.’ శ్రీదేవి షాకింగ్ డెత్ మిస్టరీ

Published on: Oct 10, 2023 03:09 PM
Loading...
Unable to load recommendations.
Follow Us