బాంబులా పేలిన ఫ్రిడ్జ్.. ఐదుగురు సజీవ దహనం
ప్రస్తుత కాలంలో అడుగడుగునా పేలళ్లే అన్నట్టు తయారైంది పరిస్థితి. సెల్ ఫోన్ నుంచి రిఫ్రిజిరేటర్ల వరకూ బాంబుల్లా పేలుతున్నాయి. ఆ మధ్య సెల్ ఫోన్ పేలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలు, ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసం అయిపోయాయి. తాజాగా పంజాబ్లో ఫ్రిడ్జ్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పంజాబ్లోని ఓ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పేలడంతో కుటుంబంలోని ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు.
ప్రస్తుత కాలంలో అడుగడుగునా పేలళ్లే అన్నట్టు తయారైంది పరిస్థితి. సెల్ ఫోన్ నుంచి రిఫ్రిజిరేటర్ల వరకూ బాంబుల్లా పేలుతున్నాయి. ఆ మధ్య సెల్ ఫోన్ పేలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలు, ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసం అయిపోయాయి. తాజాగా పంజాబ్లో ఫ్రిడ్జ్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పంజాబ్లోని ఓ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పేలడంతో కుటుంబంలోని ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. అక్టోబరు 7 అర్ధరాత్రి అవతార్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఫ్రిడ్జ్లోని కంప్రెషర్ ఒక్కసారిగా పేలడంతో ప్రమాదం సంభవించినట్టు ప్రాధమిక అంచనా వేశారు. పేలుడుతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురు చిన్నారులు ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదుగురూ మృతి చెందారు. దాంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఇట్స్ కన్సర్మ్! ప్రభాస్-లోకి సినిమా సెట్టు | రచ్చలేపుతున్న బాలయ్య కామెంట్స్
Sridevi: ఆమె చావుకు కారణం ‘ఉప్పు.’ శ్రీదేవి షాకింగ్ డెత్ మిస్టరీ
ఇజ్రాయిల్ యుద్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాలీవుడ్ హీరోయిన్
Shivaji: హౌస్లో రేలంగి మామయ్య.. బిగ్ బాస్ వాకిట్లో సిరిమల్లె చెట్టు
Amardeep: హీరో అనుకున్నంటే.. జోకర్గా మారే !! నీ కథేంది అమరా !!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్

