Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైబర్ నేరగాళ్ల భారీ స్కెచ్ !! పేమెంట్ గేట్‌ వే నుంచి రూ.వేల కోట్లు చోరీ !!

సైబర్ నేరగాళ్ల భారీ స్కెచ్ !! పేమెంట్ గేట్‌ వే నుంచి రూ.వేల కోట్లు చోరీ !!

Phani CH

|

Updated on: Oct 10, 2023 | 9:51 AM

మహారాష్ట్రలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ పేమెంట్‌ గేట్‌వే సంస్థ నుంచి ఏకంగా 16 వేల కోట్ల రూపాయలు పైనే చోరీ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. తమ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ సదరు సంస్థ ఏప్రిల్‌లో థానే నగరంలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొత్తం 25 కోట్లు పోగొట్టుకున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా ఈ మోసం సుదీర్ఘకాలంగా జరుగుతున్నట్టు గుర్తించారు.

మహారాష్ట్రలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ పేమెంట్‌ గేట్‌వే సంస్థ నుంచి ఏకంగా 16 వేల కోట్ల రూపాయలు పైనే చోరీ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. తమ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ సదరు సంస్థ ఏప్రిల్‌లో థానే నగరంలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొత్తం 25 కోట్లు పోగొట్టుకున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా ఈ మోసం సుదీర్ఘకాలంగా జరుగుతున్నట్టు గుర్తించారు. నిందితులు ఇప్పటివరకూ 16,180 కోట్లు కాజేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో ఐదుగురిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో నిందితుడిగా ఉన్న జితేంద్ర సింగ్ అనే వ్యక్తి గతంలో పదేళ్ల పాటు వివిధ బ్యాంకుల్లో రిలేషన్‌షిప్, సేల్స్ మేనేజర్‌గా పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ భారీ మోసంలో వివిధ వ్యక్తుల ప్రమేయం కూడా ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ కంపెనీలు, వ్యక్తులు నిందితుల బారిన పడి ఉండొచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పోలీసులు ఏం చేశారో తెలుసా ??

బాంబులా పేలిన ఫ్రిడ్జ్‌.. ఐదుగురు సజీవ దహనం

TOP 9 ET News: ఇట్స్‌ కన్సర్మ్‌! ప్రభాస్-లోకి సినిమా సెట్టు | రచ్చలేపుతున్న బాలయ్య కామెంట్స్

Sridevi: ఆమె చావుకు కారణం ‘ఉప్పు.’ శ్రీదేవి షాకింగ్ డెత్ మిస్టరీ

ఇజ్రాయిల్ యుద్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాలీవుడ్ హీరోయిన్