ఆర్టీసీ బస్సుల్లో తప్పని చిల్లర పైసల తిప్పలు
ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ల విక్రయంలో తలెత్తే చిల్లర సమస్య ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడం లేదు. నిరంతరాయంగా చిల్లర సమస్య కొనసాగుతూనే ఉంది. బస్సులలో టిక్కెట్ జారీ క్రమంలో తలెత్తే ఈ సమస్య బారి నుంచి ఆర్టీసీ కండక్టర్లు, ప్రయాణికులు, ఇబ్బంది పడకుండా యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు . ఇందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐటీమ్స్ యంత్రాలనూ కొనుగోలు చేశారు.
ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ల విక్రయంలో తలెత్తే చిల్లర సమస్య ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడం లేదు. నిరంతరాయంగా చిల్లర సమస్య కొనసాగుతూనే ఉంది. బస్సులలో టిక్కెట్ జారీ క్రమంలో తలెత్తే ఈ సమస్య బారి నుంచి ఆర్టీసీ కండక్టర్లు, ప్రయాణికులు, ఇబ్బంది పడకుండా యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు . ఇందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐటీమ్స్ యంత్రాలనూ కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్తో పాటు నగరంలో మెట్రో ఎక్స్ప్రెస్లు, ఆర్డినరీ బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి పోతున్నారు. దీంతో ఇందులో మహిళా ప్రయాణికులు 40 శాతం నుంచి దాదాపు 65 శాతం వరకు పెరిగారు. అయితే మహిళలకు జీరో టిక్కెట్ జారీ చేయడంతో పాటు ఇతరులకు టిక్కె ట్ ఇవ్వడంతోనే కండకర్లు చాలా బిజీగా ఉంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాల్దీవులకు దీటుగా మారుతున్న మన లక్షద్వీప్
ఆ దేశంలో 500 శాతం పెరిగిన పెట్రోల్ ధర.. ఎందుకంటే ??
గదిలో దగ్గుమందు.. ఓవర్డోస్ ఇచ్చి చంపిందా ??
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

