Watch: తిరుమల లడ్డూ నాణ్యతపై వివాదం.. చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం
తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారంరేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె వినియోగించారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.
తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారంరేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె వినియోగించారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని.. చంద్రబాబు కూడా ప్రమాణం చేసేందుకు ముందుకు రావాలని వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. మొత్తానికి ఈ వివాదం శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హిందూ వ్యతిరేకులు మాట్లాడాల్సిన మాటలు చంద్రబాబు మాట్లాడారన్నారంటూ మండిపడ్డారు. శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావించే లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. హిందువుల మనోభావాలను చంద్రబాబు కించపరిచారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే హిందూయేతరుడైన కరీముల్లా షరీఫ్ను విజిలెన్స్ అధికారిగా నియమించారని ఆరోపించారు. కరీముల్లాతో చంద్రబాబు ఆయనకు కావాల్సిన రిపోర్ట్ రాయించుకున్నారని ఆరోపించారు. జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేసినవారంతా సర్వం నాశనం అవుతారన్నారు. లేదంటే ఆరోపణలు చేసిన వ్యక్తే సర్వనాశనం అవుతారన్నారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

