ఇంటర్నెట్ డేటా లేకున్నా.. ఎంచక్కా TV, OTT ప్రసారాలు చూడొచ్చు !!

|

Sep 02, 2023 | 9:49 AM

అధునిక యుగంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ.. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త టెక్నాలజీ వచ్చేసింది. బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ.. మొబైల్స్‌లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్‌మిషన్ తరహాలోనే డీ2ఎం టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది. దీని ప్రకారం రేడియో తరంగాలను ఫోన్ రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం టీవీ చానళ్ల ప్రసారానికి వాడుతున్న 526-582 ఎంహెచ్‌జడ్ బాండ్‌ను డీ2ఎంలో వినియోగం కోసం కసరత్తు జరుగుతోంది.

అధునిక యుగంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ.. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త టెక్నాలజీ వచ్చేసింది. బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ.. మొబైల్స్‌లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్‌మిషన్ తరహాలోనే డీ2ఎం టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది. దీని ప్రకారం రేడియో తరంగాలను ఫోన్ రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం టీవీ చానళ్ల ప్రసారానికి వాడుతున్న 526-582 ఎంహెచ్‌జడ్ బాండ్‌ను డీ2ఎంలో వినియోగం కోసం కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 21 కోట్ల కుటుంబాలకు టీవీలు.. 80 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. 2026 నాటికి మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 100 కోట్లు దాటుతుందన్న అంచనా. ఈ పరిస్థితుల్లో అతిపెద్ద కంటెంట్‌ వేదికగా మొబైల్ ఫోన్లు నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మొబైల్‌ వినియోగదారులో లక్ష్యంగా కేంద్రం కసరత్తు షురూ చేసింది. మరోవైపు ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. టెలిఫోన్ ఆపరేటర్ల డేటా రెవెన్యూలో 80 శాతం పడిపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలపై టెలికా ఆపరేటర్లు నిరసన తెలిపే అవకాశాలున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు

అకౌంట్స్ జాగ్రత్త.. అడిగినప్పుడల్లా ఫింగర్ ప్రింటేశారో.. మీ పని అయిపోయినట్లే

TOP 9 ET News: ఎంట్రీ ఇచ్చిన OG సోషల్ మీడియా బద్దలే. | ఖుషీ రెస్పాన్స్‌ చూసి ఏడ్చేసిన విజయ్

Endira ee Panchayathi: మెస్మరైజ్ చేస్తున్న ‘ఏమో ఏమో’ సాంగ్

Pawan Kalyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. OG ప్రీ వీడియో గ్లింప్స్

 

Follow us on