12 వేల మందిని ఏలియన్స్ తీసుకెళ్లనున్నారా? ఆ టైమ్ ట్రావెలర్ చెప్పిన దానిలో నిజమెంత?

Updated on: Mar 06, 2025 | 5:50 PM

సింగీతం శ్రీనివాస్ రావు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆదిత్య 369 సినిమా గుర్తుందా? అందులో హీరో హీరోయిన్లు టైమ్ ట్రావెల్ చేసి భవిష్యత్తుని చూసి వస్తారు. అచ్చం అలాగే ఓ వ్యక్తి భవిష్యత్తులోకి వెళ్లి వచ్చాడట. అతనేదో సోషల్ మీడియాలో పాపులర్‌ అవడానికి ఏదో చెబుతున్నాడులే అనుకుందాం అంటే.. అతడు చెప్తున్న కొన్ని విషయాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

2025లో ప్రపంచం గతినే మార్చేసే ఉపద్రవాలు రాబోతున్నాయని తేదీలతో సహా చెప్తున్నాడు. ఇవి వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అతనేం చెప్పాడో చూద్దాం. టైమ్ ట్రావెలర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి 2025 సంవత్సరంలో కొన్ని పెను ప్రమాదాలను మానవాళి ఎదుర్కోనుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెలలు, తేదీలతో పాటు ఆ రోజు ఏం జరుగుతుందనే విషయాలను స్పష్టంగా చెప్తున్నాడు. ఇతడు చెప్తున్న వాటిలో అమెరికా అంతర్యుద్ధం, ప్రపంచాన్ని వణికించే సుడిగాలుల వంటి అంశాలున్నాయి. అంతేకాదు, గ్రహాంతర వాసుల ఆగమనం.. ఆ తర్వాత భూమిమీద జరగబోయే పరిస్థితులను కూడా అంచనా వేసి చెప్తున్నాడు. ఇతడి కాన్ఫిడెన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతుంటే.. కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనను తాను థాంప్సన్ గా పరిచయం చేసుకున్న ఈ వ్యక్తి ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు. ఇతడి పేరు మీద ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి మాత్రం 70 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఔషధ మూలికలతో రోగాలు నయం చేసే మరో వ్యాపకం కూడా అతడికి ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. తలుపు తీసి చూసి షాక్‌..

ప్రపంచంలోని సూపర్ బిలియనీర్ల జాబితాలో అంబానీ, అదానీ.. వీరి సంపద ఎంతంటే..

ఈ గులాబీ పూలను కొనాలంటే కోటీశ్వరులు కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిందే

ఇడ్లీ హెల్దీ అని తెగ తింటున్నారా… నివేదికలో విస్తుపోయే వాస్తవాలు

Samantha: ‘ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు..’ ఫీలవుతున్న సమంత!