AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Technology: AI టెక్నాలజీతో యాక్సిడెంట్లకు చెక్‌..? టోల్‌ఫీజును భారీగా తగ్గించే అవకాశం.

AI Technology: AI టెక్నాలజీతో యాక్సిడెంట్లకు చెక్‌..? టోల్‌ఫీజును భారీగా తగ్గించే అవకాశం.

Anil kumar poka
|

Updated on: Oct 30, 2023 | 8:45 AM

Share

ఇండియాలో రోడ్డు ప్రమాదాల వల్ల లక్షల మంది చనిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ ని పెంచి, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శాఖ చేసిన సర్వేలో మితిమీరిన వేగంతో వెళ్లడమే ప్రమాదాలకు కారణంగా తెలిసింది. రోడ్డుపైన స్పీడ్ లిమిట్ ను సూచించే బోర్డులు ఉన్నప్పటికీ వాటిని ఎవరూ పాటించడంలేదు.

ఇండియాలో రోడ్డు ప్రమాదాల వల్ల లక్షల మంది చనిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ ని పెంచి, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శాఖ చేసిన సర్వేలో మితిమీరిన వేగంతో వెళ్లడమే ప్రమాదాలకు కారణంగా తెలిసింది. రోడ్డుపైన స్పీడ్ లిమిట్ ను సూచించే బోర్డులు ఉన్నప్పటికీ వాటిని ఎవరూ పాటించడంలేదు. స్పీడ్ గన్స్ పెట్టినప్పటికీ పెద్దగా ఫలితం శూన్యం. నెంబర్ ప్లేట్లు మార్చి.. స్పీడ్ గన్ ను ఏమార్చి మరీ దూసుకెళ్తున్నారు కొందరు. వీటన్నిటికీ చెక్‌ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సరికొత్త టెక్నాలజీని నేషనల్ హైవేల పై ప్రవేశపెట్టనుంది. ప్రతి వాహనం ప్రభుత్వం సూచించిన స్పీడ్ లిమిట్ లో వెళ్లాల్సిందే. స్పీడ్‌ లిమిట్‌ దాటి వాహనాలు నడిపితే మధ్యలో టోల్‌ గేట్‌వద్ద ఆ వాహనాన్ని నిలిపివేస్తారు. అక్కడ స్పీడ్‌ లిమిట్‌ను అతిక్రమించినందుకు భారీగా ఫైన్‌ చెల్లించుకోవలసి ఉంటుంది. రోడ్‌ సేఫ్టీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని ఉపయోగించబోతోంది. అంతేకాదు, వాహనదారులకు టోల్ ఫీజు కూడా తగ్గించబోతున్నారు. దీంతో ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరమే టోల్ ఫీజు కట్టే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ హైదరాబాదునుంచి విజయవాడకు వెళుతున్నట్టయితే, మొత్తం మూడు టోల్ ప్లాజాల్లో ఫీజు కడతారు. కానీ కేవలం నల్లగొండ వరకూ మాత్రమే వెళ్లే వాళ్ళు కూడా చౌటుప్పల్ వద్ద టోల్ ఫీజు కట్టాల్సివస్తోంది. కానీ, ఇప్పుడు ఈ భారం తప్పుతుంది. హైదరాబాదు నుంచి విజయవాడ వరకు ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ ఫీజు కట్టే సదుపాయం అందుబాటులోకి రానుంది. నేషనల్ హైవేలపై ప్రతి 25 కిలోమీటర్ల కి ఒక సెన్సార్ ను ఏర్పాటు చేయబోతున్నారు. వాహనాలను స్కాన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా వెళుతున్న స్పీడును… ఎక్కడ నేషనల్ హైవే దిగిపోయింది అనేదాన్ని క్యాలిక్యులేట్ చేసి ఫీజును కట్ చేస్తాయి. తిరుపతి కొండ పైన ఎలాంటి నిబంధనలు ఉన్నాయో.. అలాంటివే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంత టైం లిమిట్ ఉంది. టైం లిమిట్‌కు ముందే వస్తే… ఫైన్ వేస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ కి 80 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తే రెండు గంటల 45 నిమిషాలు పడుతుంది. అంతకన్నా ముందు చేరితే టోల్ ప్లాజా లో వాహనాన్ని ఆపేసి ఫైన్ వేస్తారు. నేషనల్ హైవేల పై ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌అమలులోకి వస్తే 60 శాతానికి పైగా యాక్సిడెంట్లు తగ్గిపోతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..