AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP Mahanadu 2026: పసుపు పండగ.. టీడీపీ మహానాడు ప్రత్యక్ష ప్రసారం..

TDP Mahanadu 2026: పసుపు పండగ.. టీడీపీ మహానాడు ప్రత్యక్ష ప్రసారం..

Shaik Madar Saheb
|

Updated on: May 27, 2026 | 9:43 AM

Share

టీడీపీ మహానాడు 2026 మంగళగిరిలో ఘనంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్లతో మహానాడు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. రెండు రోజుల మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనుంది టీడీపీ.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహానాడు ప్రారంభమైంది.. ఉదయం 10:10కి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉపన్యాసంతో మహానాడు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అయితే, మహానాడుకి ముందుగా మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో ప్రధాన వేదిక దగ్గర పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు… ఇక, రెండు రోజులపాటు హైబ్రిడ్‌ విధానంలో మహానాడు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌ ప్రధాన వేదికతో క్లస్టర్ల అనుసంధానం చేశారు. ఈ క్లస్టర్ల ద్వారా కేంద్ర నాయకత్వంతో నేరుగా మాట్లాడనున్నారు కార్యకర్తలు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కార్యవర్గాల సభ్యులు పాల్గొంటారు. ఇక, 2 రోజుల మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 10 ఏపీ తీర్మానాలు, 4 తెలంగాణ తీర్మానాలు, ఒక అండమాన్‌ తీర్మానం.. నాలుగు ఉమ్మడి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించనున్న టీడీపీ. ఇక, చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెడతారు.

Published on: May 27, 2026 09:42 AM
Follow Us