AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైమరీ స్కూల్ పిల్లలపై విష ప్రయోగం వీడియో

ప్రైమరీ స్కూల్ పిల్లలపై విష ప్రయోగం వీడియో

Samatha J

|

Updated on: Apr 21, 2025 | 3:54 PM

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులు, దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామాగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో పాఠశాలలోని వంటగదికి సిబ్బంది తాళాలు వేసుకొని వెళ్లారు.

సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో దుర్వాసన, నురుగులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల హెడ్ మాస్టర్, సిబ్బంది, చుట్టుపక్కల చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. అలాగే తాగునీటి ట్యాంకులోను పురుగుల మందు కలిసినట్లుగా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం కూడా ఉండలేదు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన సమయానికి పాఠశాల సిబ్బంది గుర్తించి మధ్యాహ్న భోజనం ఉండకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ధర్మపురి పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా విష ప్రయోగం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మండిపడుతున్నారు. అసలు స్కూల్ పిల్లలపై విష ప్రయోగం చేయాల్సిన అవసరం ఎవరికీ ఉందని చిన్న పిల్లలు ఏం పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో

ఆదివారం హెయిర్‌ కట్‌ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో

సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో

Published on: Apr 21, 2025 03:53 PM