శ్రీరామునికి రెండు నూలు పోగులు ఉద్యమానికి అనూహ్య స్పందన
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పూణేలో దో ధాగే శ్రీరామ్ కే లియే అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. అయోధ్య రామాలయంలో కొలువు దీరనున్న శ్రీరాముడికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే వేలాదిమంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులు ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పూణేలో దో ధాగే శ్రీరామ్ కే లియే అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. అయోధ్య రామాలయంలో కొలువు దీరనున్న శ్రీరాముడికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే వేలాదిమంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులు ప్రారంభించారు. శ్రీరామునికి రెండు నూలుపోగులు అనే ఈ ఉద్యమ ప్రచారం 13 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 10 వ తేదీన ప్రారంభించాయి. ఈ ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని ప్రచార నిర్వాహకురాలు అనఘా ఘైసాస్ తెలిపారు. రానున్న 13 రోజుల్లో ఈ పనుల్లో భాగస్వాములు అయ్యేందుకు దాదాపు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆమె వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. లేస్ ప్యాకెట్లో రెండే చిప్స్.. రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
సంక్రాంతికి వాస్తున్న చిన్నోడు Vs పెద్దోడు.. బరిలో గెలిచేది ఎవరు ??
యువకుడితో కలిసి పారిపోయిన అమ్మాయి.. అతడి తల్లిని చెట్టుకు కట్టి..
కదులుతున్న రైలులో మహిళపై లైంగిక దాడి
సముద్రంలో ముళ్లబంతుల తొలగింపు