Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కదులుతున్న రైలులో మహిళపై లైంగిక దాడి

కదులుతున్న రైలులో మహిళపై లైంగిక దాడి

Phani CH

|

Updated on: Dec 14, 2023 | 8:28 PM

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో దారుణం జరిగింది. కదులుతున్న రైలులోని టాయిలెట్‌లో మహిళపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం టాయిలెట్‌ లోపల లాక్‌ వేసుకున్నాడు. తప్పించుకున్న బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా రైలులోని టాయిలెట్‌ డోర్‌ను బద్ధలు కొట్టి నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ఆదివారం సాయంత్రం ఒక మహిళ జబల్‌పూర్-రేవా మధ్య నడిచే మెము రైలులో ప్రయాణించింది.

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో దారుణం జరిగింది. కదులుతున్న రైలులోని టాయిలెట్‌లో మహిళపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం టాయిలెట్‌ లోపల లాక్‌ వేసుకున్నాడు. తప్పించుకున్న బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా రైలులోని టాయిలెట్‌ డోర్‌ను బద్ధలు కొట్టి నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ఆదివారం సాయంత్రం ఒక మహిళ జబల్‌పూర్-రేవా మధ్య నడిచే మెము రైలులో ప్రయాణించింది. పకారియా స్టేషన్‌ సమీపంలో ఆ మహిళ రైలులోని టాయిలెట్‌కు వెళ్లింది. ఆమెను అడ్డుకున్న ఒక వ్యక్తి టాయిలెట్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు సత్నా స్టేషన్‌లో రైలు దిగింది. ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, మహిళ అరుపులు విన్న కొందరు ప్రయాణికులు ఆ టాయిలెట్‌ వద్ద గుమిగూడారు. దీంతో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి టాయిలెట్‌ లోపల గడియ వేసుకుని ఉండిపోయాడు. ఆ రైలు రేవా స్టేషన్‌ కు చేరుకోగానే జీఆర్పీ సిబ్బంది స్పందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రంలో​ ముళ్లబంతుల తొలగింపు

ఆన్‌లైన్‌ ఆర్డర్‌లో బయటపడ్డ మోసం.. సోనీ హెడ్‌ఫోన్స్‌ పెడితే

రెండు రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. ఎక్కడంటే ??

తెలివిగా డబ్బు సంపాదించడంలో ఇదే స్టైల్

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్‌ న్యూస్‌ !! స్వామి దర్శన సమయం గంట పెంపు