Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్యరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు హీరో ప్రభాస్‌

అయోధ్యరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు హీరో ప్రభాస్‌

Phani CH

|

Updated on: Dec 30, 2023 | 1:33 PM

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభసమయం ఆసన్నమైంది. భక్తులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న ఆ శుభ తరుణం రానే వచ్చింది. 2024 జనవరి 22న మధ్యాహ్నం అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది. 2024 జనవరి 22వ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అత్యంత శుభఘడియల్లో ముహూర్తం ఖరారు అయ్యింది. 84 సెకన్లపాటు ఉన్న ఈ శుభ గడియల్లో రామయ్యకు ప్రతిష్ఠ జరిగితే భారతదేశానికి మేలు జరుగుతుందని జ్యోతిష పండితులు తెలిపారు.

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభసమయం ఆసన్నమైంది. భక్తులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న ఆ శుభ తరుణం రానే వచ్చింది. 2024 జనవరి 22న మధ్యాహ్నం అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది. 2024 జనవరి 22వ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అత్యంత శుభఘడియల్లో ముహూర్తం ఖరారు అయ్యింది. 84 సెకన్లపాటు ఉన్న ఈ శుభ గడియల్లో రామయ్యకు ప్రతిష్ఠ జరిగితే భారతదేశానికి మేలు జరుగుతుందని జ్యోతిష పండితులు తెలిపారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఎందరికో ఆహ్వానాలు అందాయి. ఈక్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌కు కూడా అయోధ్య రాముని ప్రతిష్ఠాపనకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సన్నీ దేవోల్‌, యశ్‌ సహా బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు నిర్మాత మహావీర్‌ సన్నిహిత వర్గాల సమాచారం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీఎం రేవంత్ ను కలిసిన అక్కినేని నాగార్జున, అమల

ఇంటి కాంపౌండ్ వాల్ పై నిద్రపోయిన పులి.. తెల్లారేసరికీ..

రామాలయం ఆకారంలో అయోధ్య రైల్వేస్టేషన్.. వీడియో ఇదిగో

Vijayakanth: ఆ మహమ్మారే.. కెప్టెన్‌ను మనకు దూరం చేసిందా ??

స్టార్‌ హీరోపైకి చెప్పు.. షాకింగ్ వీడియో..