AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: దక్కని ఎమ్మెల్సీ పదవి.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఏమంటే..?

Watch Video: దక్కని ఎమ్మెల్సీ పదవి.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఏమంటే..?

Janardhan Veluru
|

Updated on: Jan 17, 2024 | 5:54 PM

Share

కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ పేర్లు ఎంపిక చేసింది. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్‌ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడంపై అద్దంకీ దయాకర్ స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ పేర్లు ఎంపిక చేసింది. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్‌ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎమ్మెల్సీ పదవిని ఆశించిన అద్దంకి దయాకర్‌కు తీవ్ర నిరాశే ఎదురయ్యింది.

తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడంపై అద్దంకీ దయాకర్ స్పందించారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇంతకంటే మంచి స్థానంలో తనను పెట్టాలని పార్టీ చూస్తోందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు పదవి రాకపోవడం వల్ల అద్దంకి దయాకర్ పైన ఏదో కుట్ర జరుగుతుందని భావించడం సరైంది కాదన్నారు. పార్టీ విదేయునిగా అధిష్టానం నిర్ణయాలను గౌరవించలిసిన అవసరం తనపై ఉందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనను ముందుకు తీసుకుపోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.