పదేళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల అండతో కుర్చీపై కూర్చున్నామని, తమని ఎవరూ కదపలేరని మహబూబాబాద్ జనజాతర సభలో చెప్పుకొచ్చారు. ఆగస్ట్ 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భద్రాద్రి రాముడి సాక్షిగా మాట ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చి రుణమాఫీ చేయలేకపోయామని అన్నారు. రైతులకు వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ కచ్చితంగా అందిస్తామన్నారు. ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..