AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి..

Watch Video: కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి..

Srikar T
|

Updated on: Jun 13, 2024 | 11:56 AM

Share

ఢిల్లీ శాస్త్రి భవన్‌లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కిషన్ రెడ్డి. అంతకుముందు తెలంగాణ భవన్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే కుటుంబ సమేతంగా తెలంగాణ భవన్‌లోని పలు ఆలయాల్లో ప్రత్యే పూజలు చేశారు. అనంతరం బంగ్లా సాహిబ్ గురుద్వారాను దర్శించుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ భవన్‌ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వందనం సమర్పించారు. ఆ తర్వాత.. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లికూడా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్‎తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఢిల్లీ శాస్త్రి భవన్‌లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కిషన్ రెడ్డి. అంతకుముందు తెలంగాణ భవన్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే కుటుంబ సమేతంగా తెలంగాణ భవన్‌లోని పలు ఆలయాల్లో ప్రత్యే పూజలు చేశారు. అనంతరం బంగ్లా సాహిబ్ గురుద్వారాను దర్శించుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ భవన్‌ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వందనం సమర్పించారు. ఆ తర్వాత.. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లికూడా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్‎తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నుంచి వరుసగా గెలుపొందుతున్న బీజేపీ కీలక నేత, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కీలక శాఖలను కేటాయిస్తూ వచ్చింది. ముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయనకు గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచినందుకు కేంద్ర సాంస్కృతిక శాఖను అప్పగించింది. ఈసారి అత్యంత కీలకమైన కేంద్ర బొగ్గు, గనుల శాఖను కేటాయించడంతో తెలుగు రాష్ట్రాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని పలువురు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…