Telangana: 9 ఏళ్లలో కరువు, కర్ఫ్యూ లేదు : కేటీఆర్
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చెబుతోన్న కర్ణాటక మోడల్ను ఎద్దేవా చేశారాయన. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్ల పాటు ఇబ్బందులు పడిందని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు బీజేపీ చేసింది గుండుసున్నా అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుందని జోస్యం చెప్పారాయన.
హ్యాట్రిక్ విజయమే టార్గెట్గా బీఆర్ఎస్ ఉధృతంగా ప్రచారం చేస్తుంది. ఇంకా నామినేషన్ల పర్వం మొదలవ్వక ముందే.. యాక్షన్లోకి దిగిపోయింది. ఒకటి, రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ ఫైనల్ అవ్వడంతో.. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు అగ్రనేతలు. మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రసంగాల్లో అంశాలను ఎప్పటికప్పుడు మారుస్తూ జనంలోకి వెళ్తున్నారు.
కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తుంది బీఆర్ఎస్. తెలంగాణ రాకముందు కష్టాలను చెబుతూ.. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తీసుకొచ్చిన మార్పులను వివరిస్తూ.. కొత్త హామీలు ఇస్తూ.. కాంగ్రెస్, బీజేపీలపై ముఖ్య నేతలపై విరుచుకుపడుతున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శివపార్వతుల కల్యాణంలో సాక్షాత్కరించిన నాగరాజు
కోటి దీపాల వెలుగుల్లో..మహాశివరాత్రి వైభవం
అర్ధరాత్రి వేళ భక్తుడి ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బంది
చాక్పీస్పై సూక్ష్మ శివలింగం..
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్గా పోస్ట్
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము
ఐదుగురి ప్రాణాలను నిలిపిన చిన్నారి

