కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వాహనానికి మరొకటి ఢీకొని అలా 8 వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసీఆర్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.