Kuppam: ‘కుప్పం నుంచి నేను పోటీ చేస్తా’.. ఆసక్తి రేపిన భువనేశ్వరి కామెంట్స్
నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. కుప్పంలో రెండు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సయం చేశారు.ఈ సమయంలోనే స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ్నుంచే పోటీ చేయనున్నారు. ఈ సమయంలో నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు కుప్పంలో రెస్ట్ ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో ఈ సారి విశ్రాంతి ఇచ్చి..తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే కార్యకర్తలు, మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తనకు మనసులో ఈ కోరిక కలిగిందని.. చంద్రబాబు పోటీ చేయాలని ఎవరు అనుకుంటున్నారో చేతులెత్తండి అని ఆమె అడిగారు. దీంతో చాలామంది చేతులెత్తారు. తాను పోటీ చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు అని అడగ్గా.. మళ్లీ అందరూ చేతులెత్తారు. అలా కుదరదు… ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే, ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని… రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు… అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

