తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం పక్కా – చింతా మోహన్
ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు చింతా మోహన్. సీఎం పదవి కోరుకుంటున్న కాపులకు ఇదే సరైన సమయమన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి బరిలోకి దిగాలన్నారు. చిరంజీవి నామినేషన్ వేస్తే చాలు మేమే గెలిపించుకుంటాం అని చెప్పారు చింతా మోహన్.
రాజకీయాలు చిరంజీవి బ్రేక్ ఇచ్చి చాలా కాలం అయినా.. ఆయన సెంట్రిక్గా పొలిటికల్ కామెంట్స్ అయితే ఆగడం లేదు. తాజాగా చిరంజీవిపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం ఖాయమన్నారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు చింతా మోహన్. సీఎం పదవి కోరుకుంటున్న కాపులకు ఇదే సరైన సమయమన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి బరిలోకి దిగాలన్నారు. చిరంజీవి నామినేషన్ వేస్తే చాలు మేమే గెలిపించుకుంటాం అని చెప్పారు చింతా మోహన్. చిరంజీవికి 50వేలకు పైగా మెజారిటీ వస్తుందన్నారు. 130 అసెంబ్లీ, 20 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పారు. కాకినాడ లోక్ సభ నుంచి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ నుంచి సీపీఐ నారాయణ కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు చింతా మోహన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

