Big News Big Debate: బీ రెడీ..! నేతలకు సీఎం జగన్ వార్నింగ్.. పద్దతి మార్చుకోకపోతే వేటు తప్పదా..?
నిరంతరం ప్రజల్లోనే ఉండాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు పదేపదే చెబుతున్న సీఎం జగన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. గడప గడపకి కార్యక్రమం వర్క్షాపులో భాగంగా సమీక్ష నిర్వహించిన సీఎం...
నిరంతరం ప్రజల్లోనే ఉండాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు పదేపదే చెబుతున్న సీఎం జగన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. గడప గడపకి కార్యక్రమం వర్క్షాపులో భాగంగా సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇవాళ 32 మంది మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. అలసత్వం వద్దని.. పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు సీఎం. గడపగడపకి కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా మార్చి నాటిని పూర్తి చేసి రావాలన్నారు. మార్చిలో తుది నివేదిక వస్తుందని.. దీని ఆధారంగానే కీలక నిర్ణయాలుంటాయన్నారు సీఎం జగన్. అయితే జగన్ ఇచ్చింది వార్నింగ్ కాదన్నారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల. మళ్లీ అందరూ ఎన్నికల్లో గెలిచేందుకు సన్నదంధం కావాలని.. జనాల్లో ఉంటే సర్వేలు కూడా అనుకూలంగా వస్తాయన్న పాజిటివ్ కోణంలోనే చెప్పారన్నారు. పార్టీ అభ్యర్ధులుగా మళ్లీ వాళ్లే జనాల్లోకి వెళ్లాలన్నదే తమ ఉద్దేశం అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్కు మేయర్ ప్రకటన..
