Pink Power Run: బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కోసం.. భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.. లైవ్
క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.. దీనికి కారణం క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించకపోవడం అని నిపుణులు పేర్కొంటున్నారు.
క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.. దీనికి కారణం క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించకపోవడం అని నిపుణులు పేర్కొంటున్నారు. ముందే గుర్తిస్తే సరైన చికిత్సతో మహమ్మారితో పోరాడవచ్చు. ఈ నేపథ్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎం.ఇ.ఐ.ఎల్ (మెయిల్) ఫౌండేషన్ , సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా టీవీ9 ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమం ప్రారంభమైంది.
3 కి.మీ, 5 కి.మీ, 10 కి.మీ మారథాన్ కొనసాగుతోంది. ఈ మారథాన్ గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభం కాగా.. దాదాపు 12వేల మంది నగరవాసులు పాల్గొన్నారు.